టీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా

-

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చని భావిస్తున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టెస్ట్ చేయించుకున్న సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో హోమ్ క్వారన్ టైన్ లోకి వెళ్లి పోయారు.

రెండు రోజులుగా సంజయ్ కుమార్ ప్రముఖులను కలిసినట్టు చెబుతున్నారు. దీంతో ఆయనను కలిసిన ప్రముఖులు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇక తనను కలిసిన వారు విధిగా పరీక్ష చేయించుకోవాలని అలానే వారంతా హోమ్ క్వారన్ టైన్ లో ఉండాలని సంజయ్ కుమార్ సూచించారు. నిజానికి గతంలో కవిత కోసం తన పదవికే రాజీనామా చేస్తానని వార్తల్లో నిలిచాడు ఆయన. నిన్న కాడా కవిత ఎమ్మెల్సీగా గెలిచాక ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news