ఈ ప్రాజెక్ట్ కారణంగానే తెలంగాణ దేశానికే ధాన్య భాండాగారంగా మారింది : కేటీఆర్

-

బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యాంని సందర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్.తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టేందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగానే దేశానికే తెలంగాణ ధాన్య భాండాగారంగా మారింది. పంజాబ్, హర్యానాను తలదన్ని నీటి సమృద్ధిని సాధించటంతో వ్యవసాయ విస్తరణ జరిగింది. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో చూపి కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్ అని చూపే ప్రయత్నం చేశారు.ఎనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. సరిగ్గా గతేడాది ఇదే రోజు ఎల్ఎండీలో 12 టీఎంసీలకు పైగా నీళ్లు ఉండేవి. పంపింగ్‌కు సరైన సమయంలో చేసి ఎల్ఎండీ పూర్తి కెపాసిటీని నింపి రైతులకు భరోసా ఇచ్చాం అని తెలిపారు.

 

ఈ ఏడాది 45 శాతం వర్షపాతం తక్కువ నమోదైంది. కానీ ఇప్పటి వరకు పంపింగ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృథా పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందుకే నీటి పంపింగ్‌పై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరాం. ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరుతున్నాం. రాజకీయపరమైన కక్షతో మీరు పంపింగ్ స్టార్ట్ చేయకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వర్షం తక్కువ పడిందంటూ, వర్షాలు లేవంటూ సాకులు చెప్పి రైతులకు, ప్రజలకు నష్టం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news