అన్నమయ్య ఇంటిని పునఃనిర్మించాలి: దున్న లక్ష్మేశ్వర్

-

తిరుమలలో కూల్చిన అన్నమయ్య ఇంటిని అదే చోట పునఃనిర్మించాలని జై భారత్ జిల్లా కన్వీనర్ రామ్, జైహో రాష్ట్ర అధ్యక్షుడు కోరారు. అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద అన్నమయ్య గృహ సాధన సమితి ఏర్పాటుకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలి వాగ్గేయకారుడు, కవితా పితామహుడు, 32వేల సంకీర్తనలతో శ్రీ వేంకటేశ్వరుడి అర్చించి.. తెలుగు భాషను సుసంపన్నం చేసిన అన్నమయ్య ఇంటిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 2003లో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తొలగించింది. దీనిని జై భారత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జైహో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మేశ్వర్ దున్నా డిమాండ్ చేశారు.

జైభారత్-దున్న లక్ష్మేశ్వర్
జైభారత్-దున్న లక్ష్మేశ్వర్

అన్నమయ్య భక్తి ఉద్యమంతోనే అనేక సంస్కరణలకు ఆధ్యం పోశారని లక్ష్మేశ్వర్ దున్న తెలిపారు. ఆనాడున్న కుల వ్యవస్థ, లింగ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక సంకీర్తనలతో ప్రజలను చైతన్య పరిచారని.. ఆ రోజుల్లోనే టీటీడీ దేవస్థానంలో దళితుల ఆలయ ప్రవేశం కోసం, మహిళలకు విద్యను అందించాలని కృషి చేశారన్నారు. అలాంటి మహనీయుడి ఆనవాళ్లు లేకుండా టీటీడీ అనాలోచిత పనులు చేయడం దౌర్భాగ్యమన్నారు. టీటీడీ వెంటనే స్పందించి.. అన్నమయ్య గృహాన్ని లేదా స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దీనిలో భాగంగానే ఈ నెల 28న హైదరాబాద్ కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయశంకర్ స్వామి, జై భారత్ ప్రధాన కార్యదర్శి, విజయవిహారం ఎడిటర్ రమణమూర్తి, పోతులూరి వీరభ్రమ్మేంద్ర స్వామి ముని మనవడు వీరబట్లయ్య, దున్న ఇద్దాసు పీఠాధిపతి దున్న విశ్వదాసు తదితరులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. కావున, అన్నమయ్య, తెలుగు భాషను ఆరాధించే ప్రతిఒక్కరూ హాజరు కావాలని దున్న లక్ష్మేశ్వర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news