ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టితో ముగియనున్న దసరా ఉత్సవాలు..ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

-

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనక దుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంతో అభయ ముద్రతో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని కనులారా వీక్షించి తరిస్తున్నారు భక్తులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్టమంత్రులు సహా పలువురు రాజకీయనాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు..సాయంత్రం అమ్మవారిని హంస వాహనంపై ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు అర్చక స్వాములు.

Read more RELATED
Recommended to you

Latest news