ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు…

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కర్ఫ్యూ సడలింపు లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ఇస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు ఇవ్వగా.. 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది సర్కార్. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కటినంగా కర్ఫ్యూ కొనసాగనుంది.

ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకే సడలింపులు ఇచ్చింది సర్కార్. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు చేస్తాయని ప్రభుత్వం.. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news