విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌..రేపే ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్

-

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. రేపే ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు సెషన్లలో ఎగ్జామ్ జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో స్టేషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇది ఇలా ఉండగా… అటు ఏపీ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. నేడు పాలిసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 10:45 గంటలకు ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. కాగా, ఈ పరీక్షకు 1,43,625 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news