ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్ : 26 మందికి నోటీసులు

-

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రూ. 234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. పలు షేల్ కంపెనీల సాయంతో నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడి అనుమానిస్తుంది.

ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై విచారణకు హాజరు కావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం హైదరాబాదులోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులలో సూచించింది.

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని భావించిన జగన్ సర్కార్ సిఐడి కి విచారణను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని భావించిన సిఐడి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు సమాచారం అందించారు. దీంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం పై ఈడి దృష్టి సారించింది. తాజాగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news