ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఈడీ దాడులు

-

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ సహా మరో ఐదు ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడి ఇంటిలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. మనీష్ సిసోడియ సన్నిహితుడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

తన వ్యక్తిగత సహాయకుడు దేవేంద్ర శర్మను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ ద్వారా ఇంటిపై దాడి చేశారని, బ్యాంకు లాకర్లను శోధించారని, మా గ్రామంలో తనిఖీ చేశారు కానీ.. నాకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లభించలేదని ట్విట్టర్లో తెలిపారు డిప్యూటీ సీఎం. ఇప్పుడు తన వ్యక్తిగత సహాయకుడిని అరెస్టు చేశారని మనిష్ సిసోడియా తెలిపారు. ఇక సిసోడియా సహచరుడు దేవేంద్ర శర్మ, మరి కొందరినీ ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు ఈడి అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news