బీబీసీకి షాక్.. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ కేసు నమోదు

-

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది.విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా సదరు సంస్థపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

బీబీసీ ఇండియా కార్యాలయంలో కొద్ది నెలల క్రితం ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు నిర్వహించిన ఆ తనిఖీలను.. ‘సోదాలు కాదు.. సర్వే’ అని అధికారులు పేర్కొన్నారు. సర్వే అనంతరం బీబీసీ వార్తా సంస్థ చూపుతున్న ఆదాయం, లాభాల్లో తేడాలున్నాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ(సీబీడీటీ) తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ, ఐటీ అధికారులు.. బీబీసీ ఉద్యోగులు ఇచ్చిన వివరాలు, డిజిటల్ అధారాలు, పత్రాల ద్వారా కీలకమైన ఆధారాలను వెలికితీసింది. డాక్యుమెంటేషన్‌ బదిలీ ధరలకు సంబంధించి అనేక వ్యత్యాసాలు, అసమానతలు ఉన్నాయని వెల్లడించింది.

అయితే, గోద్రా మారణకాండ వెనక నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ తనిఖీలు చోటుచేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news