గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారు..కేసీఆర్ మెడలు వంచుతాం – ఈటల

-

గన్ పార్క్ అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజానీకం 2 వ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు..శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారన్నారు.

సమావేశాలు 2- 3 రోజులకే పరిమితం చేస్తున్నారు..పోయినసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడం పై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారని వివరించారు. తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం సంతోషంగా లేదు.. ముఖ్యమంత్రి మాకు 6,12,13 వ తేదీ మాత్రమే సమావేశాలు అని నోటీసులు పంపారు..చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సమావేశాలు జరగలేదన్నారు.

బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారు..కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని ఆగ్రహించారు. పోడు భూములు,దళిత బంధు ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతాం.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17ను మరిచిపోయారని మండిపడ్డారు. అమిత్ షా స్వయంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా జరిపి అండగా ఉంటామని చెప్పారు..తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు ఈటల.

Read more RELATED
Recommended to you

Latest news