ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాపై ఈటల షాకింగ్ కామెంట్స్

-

కరీంనగర్ జిల్లా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాపై మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో దళిత బిడ్డలకు పెడుతున్న అన్నంకు కూడా కెసిఆర్ పైసలు ఇవ్వడని.. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశాడని ఈటల పేర్కొన్నారు. దళిత బంధు అన్నాడు, తర్వాత బీసీల బంధు అంటాడు, ఎన్నికలు అయిన తర్వాత అన్ని బంధు పెడతాడు అని మండిపడ్డారు.

వారి నియోజక వర్గాల్లో పనులు చేయడానికి చేతకాని ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి అన్ని ఇస్తామం టున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో దెబ్బ కొడితే కేసీఆర్ కు దిమ్మ తిరగాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను గంజిల ఈగ లెక్క తీసేసిన వ్యక్తి కేసీఆర్ అని ద్వజమెత్తారు.

తాను రాజీనామా చేయడం వల్ల ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, గొల్ల, కురుమలకు గొర్లు, దళిత బంధు వస్తుందన్నారు. ఇన్ని ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరితో గొడువ పడ లేదని…ఏ పార్టీ జెండా కూడా పీకించలేదని తెలిపారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పని చేసిన సమయంలో అసెంబ్లీలో తనను అందరూ శభాష్ అన్నారని ఈటల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news