TSPSC పేపర్ లీక్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ…

-

తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన మొదట TSPSC పేపర్ లీక్ ఆ తర్వాత టెన్త్ క్లాస్ పరీక్ష పాత్రలు లీక్ అయ్యి గందరగోళాన్ని సృష్టించాయి. ముఖ్యంగా TSPSC పేపర్ లీక్ కేసు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది, ఈ కేసులో ప్రవీణ్ మరియు రాజశేఖర్ లను అసలు నిందితులుగా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను జైల్లోనే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ పేపర్ లీక్ లో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు.

ఇదే అంశంపై గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కి ఫిర్యాదు చేశారు. మరి ఈ విచారణ వేగవంతం అయిన నేపథ్యంలో ఏమైనా కీలక సమాచారం బయటకు వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news