హైదరాబాద్‌ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు

-

హైదరాబాద్‌ లో అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటైంది. ఈ మేరకు ఈ అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ ట్రస్ట్‌ డీడ్‌ రిజిస్టేషన్‌ ఇవాళ పూర్తి అయింది. ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు జడ్జిలు ఎల్‌ నాగేశ్వర రావు, ఆర్‌. సుభాష్‌ రెడ్డి, హై కోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్ర కరణ్‌ రెడ్డి, మల్టి నేషనల్‌ కంపెనీలు అర్బిట్రేషన్‌ కోసం సింగపూర్‌, దుబాయ్ కు వెళ్లాల్సిన పరిస్థి ఉండేది. అయితే.. ఆర్భిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు తో హైదరాబాద్‌ కు అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు రానున్నారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుతో వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. పీవీ హయంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయని… పెట్టుబడులు పెట్టేవారు.. లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని తెలిపారు. అయితే.. ఆ సమస్యలను పరిష్కరించేందుకు.. అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివాదాల పరిష్కారానికి కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పరిశ్రమలకు ఆర్బిట్రేషన్‌ కేంద్రంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లో అంతర్జాతీయ అర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు.. సీజేఐ మానస పుత్రిక అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news