ఈటల సీఎం సీట్లో కూర్చోవాలని ప్రజలు కోరుకుంటున్నారు : ఈటల జమున

-

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్‌కు తప్ప మరో పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదని ఆయన సతీమణి ఈటల జమున అన్నారు. కష్టసుఖాల్లో ఆదుకున్న ఈటలకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారన్నారు.

Huzurabad By-Election: ఉప ఎన్నికలో నామినేషన్ వేసిన ఈటల జమున | Etela Jamuna  said that it is Sentiment to Nominate Everytime when Rajender Nominates

అందరు కూడా ఈటలను ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం సంతోషంగా ఉందన్నారు. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీ చేస్తానన్న ఈటలకు ఈ రెండు నియోజకవర్గాలు రెండు కళ్లలాంటివన్నారు. మా సారు గెలవాలే… ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనేది ప్రజల నినాదంగా ఉందన్నారు. ఈటల రాజేందర్ ఇక్కడ నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ కష్టసుఖాల్లో వారికి తోడుగా ఉన్నానని చెప్పారు. మేమంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఇష్టమని, వారంటే మాకు ఇష్టమన్నారు. అందుకే ఈటలను ఏడుసార్లు గెలిపించినట్లు చెప్పారు. ఉప ఎన్నిక విజయమే… డిసెంబర్ 3న రిపీట్ అవుతుందన్నారు ఈటల జమున.

Read more RELATED
Recommended to you

Latest news