ఎన్నికలెప్పుడు వచ్చిన అధికారం మాదే

-

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెరాస దే అధికారమని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెరాస ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, పాలనా విధానాలే మమల్ని గెలిపిస్తాయన్నారు. చివరి ఆరు నెలలు ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల వాతావరణమే ఉంటుంది, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసమే వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈటల వ్యక్తం చేశారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news