విజయసాయిరెడ్డి ని చూసి బురదలో పందులు కూడా సిగ్గుపడుతున్నాయి – బుద్దా వెంకన్న

-

వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై తీవ్రస్థాయిలోలో విరుచుకుపడ్డారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. విజయసాయి రెడ్డిని చూసి బురదలో పందులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై ట్వీట్లు పెట్టడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడన్నా విజయసాయి పట్టించుకున్నారా? అంటూ ప్రశ్నించారు. కుక్కకి పిచ్చి ముదిరితే రాళ్లతో కొట్టే పరిస్థితిని విజయ సాయి తెచ్చుకోవద్దని అన్నారు.ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయరో చర్చించేందుకు నేను సిద్ధం, విజయసాయి సిద్ధమా? హనీ సవాల్ విసిరారు.

ఇవాళ ఎన్నికలు జరిగితే వైసీపీకి ఉన్న 151 స్థానాల్లో ఒడిపోవటం ఖాయమన్నారు బుద్దా వెంకన్న. పాపాత్ములకు కూడా అప్పుడప్పుడు మంచి రోజులోస్తాయనటానికి విజయసాయి ఓ ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై విజయసాయి ట్వీట్లు పెట్టలేడా..? వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేశినేని నాని గురించి మాట్లాడే స్థాయి నాది కాదు, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మాకు చంద్రబాబే ఏకైక నాయకుడు, ఆయన మాటే శిరోధార్యమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news