BRS లోకి మాజీ ఐఏఎస్ జెడి లక్ష్మీనారాయణ ?

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల పేరుతో.. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో brs పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే కెసిఆర్ స్థాపించిన ఈ జాతీయ పార్టీ ఏపీలోనూ పోటీ చేస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మద్దతుపై కాకుండా జనాదరణ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడినట్టు సమాచారం. అందులో భాగంగానే పలువురు కీలక నేతలపై ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు దృష్టి సారించినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణకు పార్టీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. లక్ష్మీనారాయణతో సమావేశం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఏ పార్టీలో చేరాలి అన్నదానికి ఇంకా సమయం ఉందని మంత్రి ఆహ్వానానికి లక్ష్మీనారాయణ బదులిచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పటికే లక్ష్మీనారాయణ ఆమ్ ఆద్మీ పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news