మాజీ ఎంపీ వినోద్ కుమార్ పదవీకాలం పొడగింపు

-

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ని ప్రభుత్వం 2019లో నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్ ను ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా సీఎం నిర్ణయించారు.

గతంలో వినోద్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు వాటిని పొడగించారు. రాజకీయాల్లో, పరిపాలన అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆయన పదవీ కాలాన్ని పొడిగించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news