ఫ్యాక్ట్ చెక్: లతా మంగేష్కర్‌ పాదాల వద్ద షారుఖ్ ఉమ్మివేశాడా..? అసలు నిజం ఏమిటి..?

-

లతా మంగేష్కర్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఫిబ్రవరి 6న ఆఖరి శ్వాస ని విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కడసారి నివాళులు ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు అర్పించారు. అయితే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా లెజెండరీ సింగర్ కు వీడ్కోలు పలకడానికి వచ్చారు. అయితే ఆయన నివాళులు అర్పించేటప్పుడు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

షారుఖ్ తన మేనేజర్ తో పాటు లతా మంగేష్కర్ కి నివాళులు అర్పించడానికి వచ్చారు. మాస్క్ కిందకి దించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత పాదాల దగ్గర ఊదారు. అయితే ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.

పైగా షారూఖ్ ఉమ్మి వేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజంగా ఉమ్మి వేశాడా అనేది చూస్తే షారుక్ ఉమ్మ వేయలేదు అని తెలుస్తోంది. భౌతికకాయం దగ్గర కేవలం ప్రార్థన మాత్రమే చేశారు. అయితే షారుక్ ఖాన్ ఉమ్మ వేశాడని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు పైగా ఎన్నో ట్రోల్స్ కూడా దీని మీద వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news