దారుణ హత్య.. ప్రియురాలి కోసం వెళ్ళి..!

-

ప్రపంచం ఒక పక్కన అభివృద్ధి పధంలో దూసుకుపోతుంటే.. కొందరు మాత్రం కులం, కట్టుబాట్లు అని గిరి గీసుకొని బతుకుతున్నారు. పరువు కోసం ఎంతకైనా తెగిస్తారు. తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలి చూడటానికి వెళ్ళి ఆమె ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. చిదంబరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన కలకలం రేపింది.

చిదంబరం అరంగనాథన్‌ వీధి లో ఉన్న బాబు కుమార్తె శ్వేత  తో పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రియురాల్ని చూడలేని పరిస్థితుల్లో పడ్డ, ఈ ప్రేమికుడు గత నెల ఆమె ఇంటి వద్దకు వెళ్లి బుక్కయ్యాడు. శ్వేత కుటుంబీకులు తీవ్రంగా మందలించి పంపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ఆ ఇంట్లో ఎవరు లేరన్న సమాచారంతో శ్వేత కోసం వెళ్లి మళ్ళీ బుక్కైయ్యాడు. దీంతో అతడి ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు కలిసి అతడిని పట్టుకుని నరికి చంపారు. దీంతో అక్కడికక్కడే  అన్భళగన్‌ ప్రాణాలు కోల్పోయాడు. తమ పరువు తీస్తున్నాడన్న కోపంతోనే తాము అతడిని చంపామని ఆ కుటుంబం ఓ లేఖను ఇంట్లో ఉంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసును ప్రేమ పరువు హత్యగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news