పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

-

పంజాబ్​లోని లూధియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబం దుర్మరణం చెందింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఐదుగురు మరణించగా.. ఒకరు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు.

లుధియానాకు చెందిన ఓ కుటుంబం చండీగఢ్​లో ఓ ఫంక్షన్​కు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఫోకల్​ పాయింట్ పోలీస్ స్టేషన్​ పరిధిలో కారు అదుపుతప్పి డివైడర్​ను తాకింది. అనంతరం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో అందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

మృతులను రాజేశ్​ కుమార్​ (40), అతడి కుమార్తె జాస్మిన్ (​5), మరదలు సంజన (30) ఆమె ఇద్దరు కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్​ కుమార్​ భార్య ప్రియ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాజేశ్​.. ప్రతాప్​ కాలనీకి చెందిన ఓ వ్యాపారవేత్త అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news