అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో విచారణ

-

ఏపీ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 12న అమరావతి నుంచి అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాదయాత్రకు అనుమతి కోసం ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు చేసినట్లు వివరించారు.

అయితే పోలీసుల నుంచి అనుమతి ఇచ్చినట్లుకానీ, తిరస్కరించినట్లు కానీ సమాచారం రాలేదని ధర్మాసనానికి తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు.. పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది రెండురోజుల సమయం కోరగా తదపరి విచారణను ఈనెల 8వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news