సీక్వెల్స్ ట్రెండ్.. ‘ఆర్ఆర్ఆర్’కూ వర్తింపు.. ఆలోచనలో రాజమౌళి !

-

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తొందని చెప్పొచ్చు. గతంలో రాజమౌళి ‘బాహుబలి : ద బిగినింగ్’ అనే చిత్రం తీసి అందులోని ట్విస్ట్ ఆధారంగా భారీ పబ్లిసిటీ చేశాడు. అలా ‘బాహుబలి : ద కంక్లూషన్’ ఫిల్మ్ చేసి రికార్డులు తిరగ రాశాడు. ఈ క్రమంలోనే పలువురు చిత్ర దర్శకులూ అలానే ప్లాన్ చేస్తున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ పార్ట్ వన్ రిలీజ్ గతేడాది డిసెంబర్ లో అయి సక్సెస్ కాగా, ప్రజెంట్ పార్ట్ టూ షూటింగ్ జరుగుతోంది. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ కూడా రెండు భాగాలుగా ఉండబోతున్నది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్, ఆదిపురుష్’ లు కూడా రెండు భాగాలుగా ఉంటాయట.

అలా మొత్తంగా చిత్రాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సీక్వెల్ తీయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ డ్రామను ఇంకా ఎక్స్ టెండ్ చేయడం ఈజీయేనని అంటున్నారు. అయితే, రాజమౌళి గతంలోనే చాలా స్పష్టంగా ‘ఆర్ఆర్ఆర్’ సింగిల్ పార్ట్ మూవీ అని పేర్కొన్నారు. కాగా, ఆడియన్స్, అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ తో కూర్చొని స్టోరి ఎక్స్ టెండ్ చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు, భజరంగీ భాయి జాన్’ సినిమాలకు విజయేంద్రప్రసాద్ సీక్వెల్స్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ కు కూడా సీక్వెల్ రాసే చాన్సెస్ ఉంటాయని పలువురు అభిమానులు చెప్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నది. ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ తేజ్ నటించగా, చెర్రీ సరసన ఆలియా భట్, తారక్ కు జోడిగా ఒలివియా నటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news