ఈనెల 7న రాహుల్ గాంధీ పాదయాత్ర వీడ్కోలు సభ – రేవంత్ రెడ్డి

-

మరో మూడు రోజుల్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన సమీక్షాా సమావేశంలో పాల్గొన్నారు టి.పి.సి.సి చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని అన్నారు.

అలాగే ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈనెల 5, 6వ తేదీలలో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రానందున వారు ఈమె ఎరుగన్న రోజులలో పాదయాత్రలో క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఇక ఈనెల 7వ తేదీన రాత్రి దెగ్లూరు లో రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news