BREAKING : టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు బిగ్ ట్విస్ట్… తెరపైకి డిప్యూటీ మాజీ ముఖ్యమంత్రి !

-

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేర సారాల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

టిఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి కూడా బిజెపిలో చేరేందుకు అవకాశం ఉన్న వారి పేర్లు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ లో బయటపడ్డాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా పార్టీ మారే నేతల జాబితాలో ఉన్నట్లు వాట్సాప్ మెసేజ్ లలో ఉంది. ఇతర పార్టీలలోని చాలామంది కీలక నేతలు కూడా టచ్ లో ఉన్నారని, ఎమ్మెల్యేలతో పాటు కలిసి వీళ్ళు చేరేలా చర్చలు జరిపినట్లు నివేదికలో పేర్కొంది. ఇతర పార్టీలలో బాగా పలుకుబడి ఉన్న సీనియర్ నేతలను చేర్చుకునేలా ప్రణాళికలు రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news