యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏకంగా 18 మంది !

-

తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. మైత్రి ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

అలాగే ఇందులో ముగ్గురు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news