పసికందుపై తండ్రి రాక్షసత్వం.. మానవత్వం చచ్చిపోతుంది.. ?

-

తల్లిదండ్రులు అంటే పిల్లలకు దైవంతో సమానం.. కానీ నేటికాలంలో కొందరు మాత్రం పిల్లల పాలిట యమకింకరులుగా మారుతున్నారు.. వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నారు.. కొందరైతే పూర్తి బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.. ఇకపోతే ఒక దుష్టుడైన తండ్రి తన 54 రోజుల పసికందును విచక్షణ కోల్పోయి కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుందట.. అంతే కాకుండా ఆ పసికందు మెదడులోని పొరల మధ్య రక్తం గడ్డ కట్టి సబ్‌డ్యూరల్ హేమరేజ్ సమస్య మొదలైందని వైద్యులు తెలిపారు..

కేరళలోని యర్నాకులం జిల్లాలో జరిగిన ఈ సంఘటన పలువురిని కంటతడిపెట్టిస్తుంది.. ఇకపోతే చిన్నారిని దారుణంగా కొట్టిన ఆ తండ్రి పేరు షైజు థామస్.. ఇతను తాగుడుకు బానిసగా మారి నిత్యం తన భార్యను వేధించేవాడట.. ఈ క్రమంలో బాలింత అయిన తన భార్యను కొట్టడమే కాదు.. ఆ కోపంలో ఈ చిన్నారి తలపై బలంగా తన్నడంతో పాటు మంచం మీదకు విసిరేశాడట. తలకు గాయం అవడంతో పాటుగా ఈ పసిది ఆగకుండా ఏడుస్తుండటంతో హాస్పిటల్ కు తీసుకురాగా అసలు విషయం తెలిసిందట..

 

ఇకపోతే తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ అవతుండటంతో ప్రస్తుతం పసిబిడ్డను ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచారట. ఆ పసికందుపై తండ్రి రాక్షసత్వం చూపించడం ఇది తొలిసారేం కాదని అతని భార్య పేర్కొంది.. కాగా ఈ రాక్షసుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదు చేసి జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద దర్యాప్తు జరుపుతున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీకే జాస్సీ అన్నారు.. ఇక ఇలాంటి వారివల్ల తండ్రి అనే పదమే కళంకమై పోతుందని, ఇతనిలో మనిషి లక్షణాలకంటే రాక్షసత్వమే కనబడుతుందని నెటిజన్స్ చివాట్లు పెడుతున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news