అన్నిటికీ బామ్మర్దులు వస్తున్నారని భార్యను చంపేశాడు !

-

వాయువ్య ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో 30 ఏళ్ల వ్యక్తి తన భార్యను గొంతు కోసి చంపాడు. వారి వివాహ జీవితంలో తన అత్తమామలు, బామ్మర్దుల నుండి అనవసరమైన జోక్యంతో విసుగు చెంది అతను ఈ పని చేశాడని పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు రమా కాంత్‌ ను లేబర్ పని చేస్తుంటాడు.

murder
murder

ఇక ఈ హత్య అనంతరం అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన భార్య, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారని వారు తెలిపారు. అదే ఇంట్లో శనివారం మృతదేహం లభించిందని పేర్కొన్నారు. చిన్న సమస్యల మీద కూడా రమా కాంత్ తన భార్య సోని (28) తో తరచూ గొడవపడేవాడు. అయితే ఈ విషయాల్లో అన్నిటికీ తన అత్తమామలు, బావామరుదుల  నుండి తరచూ జోక్యం చేసుకోవడంతో అతను భార్యను చంపాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత అతను పారిపోయాడు. 

Read more RELATED
Recommended to you

Latest news