BIG BREAKING : జనసేన చేరనున్న సినీ నటుడు పృథ్విరాజ్‌

-

BIG BREAKING : సినీ నటుడు పృథ్వి రాజ్‌ సంచలన నిర్ణయం తీసు కున్నాడు. జనసేన పార్టీలో చేరేందుకు సినీ నటుడు పృథ్విరాజ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు జనసేన సీనియర్‌ నాయకులు, నటుడు నాగబాబుకు కలిసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు సినీ నటుడు పృథ్విరాజ్‌. దీంతో త్వరలోనే జనసేన కండువా కప్పుకోనున్నారు పృథ్విరాజ్‌.

కాగా సినీ నటుడు పృథ్విరాజ్‌.. గతంలో వైసీపీ పార్టీలో పనిచేశారు. అంతేకాదు 2018 లో ఎస్‌వీ బీసీ కి చైర్మన్‌ గా కూడా సినీ నటుడు పృథ్విరాజ్‌ పని చేశారు. ఆ తర్వాత ఓ ఆడియో వైరల్‌ కావడంతో.. పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు పృథ్విరాజ్‌. ఇక తాజాగా జనసేన పార్టీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు పృథ్విరాజ్‌.

Read more RELATED
Recommended to you

Latest news