ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో మిల్కీ బ్యూటీ తమన్నా….

-

ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకులకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక మరీనా సంగతి తెలిసిందే. మార్చి 31 సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో మిల్కీ బ్యూటి తమన్నా ప్రత్యేక కనిపించనున్నారు. ఈ మేరకు ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. శ్రీవల్లి కూడా ఐపీఎల్ వేడుకల్లో హాట్ ఫర్ఫామెన్స్ ఇవ్వబోతుంది. అదేనండి రష్మిక మంధాన కూడా..ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో సందడి చేయనుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక..ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అదే సినిమాలోని సాంగ్స్ కు డ్యాన్స్ చేసే అవకాశం ఉందని సంసాచారం.

Tamannah set to perform in IPL opening ceremony

కరోనా కారణంగా రెండేళ్ల పాటు టీమ్స్ సొంత గ్రౌండ్స్ తో పాటు..ఇతర వేదికల్లో మ్యాచ్లు నిర్వహించలేదు. అయితే ఈ సారి ఐపీఎల్ ఫ్రాంచైజీలోని సొంత మైదానంతో పాటు..ప్రత్యర్థి మైదానంలోనూ మ్యాచులు జరగబోతున్నాయి. మార్చ్‌ 31 నుంచి ఐపీఎల్‌ 16 స్టార్ట్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో..బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ సారి ఓపెనింగ్‌ సెర్మనీ గ్రాండ్‌గా నిర్వహించున్నాయి. ఈ ఓపెనింగ్ సెర్మనీలో తమన్నా, రష్మికతో పాటు..మరికొందరు బాలీవుడ్ యాక్టర్లు కూడా పాల్గొనబోతుండటంతో…ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news