‘విక్రమ్’ థియేటర్లో చెలరేగిన మంటలు..పరగులు తీసిన ప్రేక్షకులు..ఎక్కడంటే?

-

ప్రజెంట్ సోషల్ మీడియాలో కమల్ హాసన్ ‘విక్రమ్’ మేనియా కొనసాగుతోంది. థియేటర్లలో ఈ సినిమాను జనాలను బాగా లైక్ చేస్తున్నారు. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా అంచనాలను మించి ప్రజలను ఆకట్టుకుంటోంది.

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..లో సూర్య గెస్ట్ రోల్ ప్లే చేశారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. కాగా, సూర్య ఎంట్రీ సందర్భంగా అభిమానుల అత్యుత్సాహం వలన థియేటర్ స్క్రీన్ పైన మంటలు చెలరేగాయి. దాంతో అభిమానులు టాకీసు నుంచి పరుగులు తీశారు.

పుదుచ్చేరిలోని జయ థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. హీరో సూర్య ఎంట్రీ సీన్‌ రాగానే తెరకు ఓ వైపు నుంచి అగ్గి రాజుకుంది. అది నెమ్మదిగా స్క్రీన్‌ అంతా వ్యాపించింది. థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయి అని కొందరు అంటుంటే సూర్య ఫ్యాన్స్‌ పటాసులు పేల్చడం వల్లే ఆ ప్రమాదం సంభవించిందని మరికొందరు చెప్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news