BREAKING : మంచిర్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

-

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో చెలరేగిన మంటలు ఏకంగా 6 గురిని బలితీసుకున్నాయి. అయితే.. ఈ సంఘటనపై ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు.

చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తమని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news