టీచర్లకు జగన్‌ సర్కార్‌ శుభవార్త..బదిలీలపై కీలక ప్రకటన

-

ఏపీలోని టీచర్లకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. బదిలీలపై కీలక ప్రకటన చేసింది విద్యాశాఖ. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న భేటీ అయ్యారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఉపాధ్యాయ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అడిగిన సవరణల పై కూడా సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

శనివారం సాయంత్రంలోపై దీనిపై బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు బొత్స. ఈ నెల 21 నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ నెల 21 న బాపట్ల జిల్లాలో 8 వ తరగతి విద్యార్ధులకి సీఎం ట్యాబ్ లు పంపిణీ చేస్తారని.. 5.18 లక్షల మంది 8వ తరగతి విద్యార్ధులు, ఉపాధ్యాయులకి ఈ ట్యాబ్ లు ఇస్తామని వెల్లడించారు. ఇందు కోసం 686 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. బైజూస్ కంటెంట్ ని ట్యాబ్‌లలో అప్ లోడ్ చేసి ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news