సంగారెడ్డి జిల్లా జిన్నారం మైలాన్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డి పోతారం మైలాన్ కంపెనీ గిడ్డంగి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటల్లో చిక్కుకొని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపుచేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మృతులు లోకేశ్వర్ రావు, రంజిత్ కుమార్, పరితోష్ మెహతా గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news