కరోనా హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం..ఆరుగురు పేషేంట్ల దుర్మరణం

-

గుజరాత్ రాజ్‌కోట్‌ లోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివానంద్ ఆసుపత్రిలోని కోవిడ్ -19 వార్డ్ కి చెందిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఆరుగురు పేషేంట్ల మరణించారు. ఉదయం ఒంటి గంట జరిగిన ఈ సంఘటన జరిగిన ఉదయ్ శివానంద్ ఆసుపత్రిలోని ఐసియు యూనిట్‌లో ఏడుగురు కోవిడ్ రోగులు ఉన్నారు. ఐసియు నుంచి మంటలు ప్రారంభమయ్యాయని స్థానిక అధికారులు భావిస్తుండగా, అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

ఆసుపత్రిలో మొత్తం 33 మంది రోగులు ఉన్నారు. మంటల గురించి సమాచారం ఇచ్చిన తరువాత మేము అక్కడికి చేరుకుని 30 మంది రోగులను రక్షించాము. ఐసియు లోపల ఉన్న ఆరుగురు రోగులు మరణించారని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తేలలేదని తెలిపారు. రక్షించిన రోగులను ఇతర కోవిడ్ -19 ఆస్పత్రులకు తరలించామని వారు తెలిపారు. ఆగస్టులో కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో భారీగా మంటలు చెలరేగడంతో 8 మంది మరణించారు.  

Read more RELATED
Recommended to you

Latest news