రెండుసార్లు పోలీసులు నన్ను చంపడానికి ప్రయత్నించారు : స్వామి గౌడ్ సంచలనం 

-

టీఆరెస్ నేతగా ఉండి ఒక టర్మ్ శాశనమండలి చైర్మన్ గా పని చేసిన స్వామి గౌడ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంధర్హ్మ్గా  స్వామి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి ఇంట్లో ముగ్గురు పిల్లలను కనండన్న ఆయన ఆ మధ్య శాసన మండలి చైర్మన్ గా ఉండి.. ఇదేమాట నేను అంటే ఎంతో రచ్చ చేశారని అన్నారు. అదేమాట ఇప్పుడు మళ్లీ అంటున్న దంపతుల్లారా… ముగ్గురు పిల్లలను కనండి అని పిలుపునిచ్చారు. కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నావ్ నీకేం తక్కువ చేశాడు కేసీఆర్ అని కొందరు అంటున్నారని, నన్నేం రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చి చైర్మన్ చేయలేదని అన్నారు.

కొత్త బట్టలు కొనిచ్చాను.. ముడ్డిమీద తంత పడు !! అంటే నేను ఎలా పడతాను ? ని ఆయన ప్రశ్నించారు. రెండుసార్లు పోలీసులు నన్ను చంపడానికి ప్రయత్నించారని ఆయన కలకలం రేపారు. ఇక ఆత్మాభిమానం లేని… ఏ పదవీ నాకు అవసరం లేదన్న ఆయన 2 ఏళ్ల నుంచి 2 నిమిషాల టైం నాకు కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ ని నా తండ్రి లా భావించానని కానీ చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెట్టాడని ఆయన్ ఆన్నారు. పార్టీని, కేసీఆర్ ని బాండ బూతులు తిట్టిన వారికి, తొడలు కొట్టిన వారికి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చాడని ఆయన అన్నారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చెయ్యి వేస్తే.. నీ దారుసలం పగలగొడతా అని చెప్పిన దమ్మున్న మొనగాడు బండి సంజయ్ అని, పార్టీకి అలాంటి బలమైన నాయకత్వం కావాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news