పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

-

కృష్ణా: బాపూలూరు మండలం అంపాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్ కంపెనీలో మంటలు ఎగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. ప్రొక్లెయిన్ ట్రాక్టర్ దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరూ లేనట్లు గుర్తించారు.

కాగా గ్రామ శివారులో ఈ కంపెనీ ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. షార్ట్ సర్య్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చిని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కంపెనీ యజమానులకు సమాచారం అందజేశారు. ప్రమాదంపై నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news