పులివెందులలో కాల్పుల కలకలం

-

కడప జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్. పలు సినిమాల్లో కూడా భూతద్దంలో చూపించిన ఘటనలు, గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ ముద్ర పడడానికి కారణంగా చెప్పవచ్చు. అయితే కాలం మారింది, ఫ్యాక్షన్ పూర్తిగా మాసిపోయిందని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ నేటికీ జిల్లాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కడప జిల్లా పులివెందులలో కాల్పుల మోత మోగింది.

భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో దిలీప్, మహబూబ్ భాషా కు గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే భరత్ కుమార్ – దిలీప్ మధ్య ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ భరత్ కుమార్ అనే వ్యక్తిని వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ అధికారులు గతంలో విచారించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news