మహారాష్ట్రలోని ముంబ్రాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ లో విపరీతంగా జనాలు ఎక్కడంతో పట్టాలపై జారీ కొంతమంది పడిపోయారు. భారీ రద్దీ కారణంగా పట్టాలపై జారిపడి 5 మంది మరణించారు. కొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు.

వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/greatandhranews/status/1931938576692085046