Breaking : మేడారం జాత‌ర‌కు వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

-

మేడారం జాత‌ర‌కు వెళ్తుండ‌గా.. విషాదం చోటు చేసుకుంది. మ‌హా జాత‌రకు వెళ్లే మార్గ మ‌ధ్య లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు భ‌క్తులు అక్క‌డి కక్క‌డే మృతి చెందారు. ఈ విషాద క‌ర‌మైన ఘ‌ట‌న ములుగు జిల్లా లోని గ‌ట్ట‌మ్మ ఆల‌యం వ‌ద్ద జ‌రిగింది. కాగ ఆర్టీసీ బ‌స్సు, ఒక కారు ఎదురు ఎదురు గా వ‌చ్చి ఢీ కొట్టాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదుగురు భ‌క్తులు అక్క‌డి క‌క్క‌డే మృతి చెందారు.

కాగ మేడారం జాత‌ర నేటితో ముగియ‌డంతో ల‌క్షల సంఖ్యలో భ‌క్తులు.. మేడారానికి వస్తున్నారు. వాహానాలు కూడా అధిక సంఖ్య‌లో మేడారానికి వ‌స్తున్నాయి. దీంతో అక్క‌డక్క‌డ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. కొన్ని చోట్ల స్వ‌ల్ప ప్ర‌మాదాలు జ‌రుగుతుండగా.. మ‌రి కొన్ని చోట్ల ఘోర మైన రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. అలాగే గురు వారం రాత్రి కూడా మేడారం జాత‌ర‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో ఇద్ద‌రు భ‌క్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగ తాజా గా ఆర్టీసీ బ‌స్సు.. కారు ఢీ కొని ఐదుగురు భ‌క్తులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news