మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు రూ.1 లక్ష జరిమానా

-

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు రూ.1 లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ తెలిపింది. అసలు విషయంలోకి వెళితే.. చిక్కుల్లోపడ్డాడు. విషయం ఏంటంటే… యువరాజ్ సింగ్ కు గోవాలోని మోర్జిమ్ లో విలాసవంతమైన పేరు ‘కాసా సింగ్’ అనే భవనం ఉంది. ఈ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఆయన ఇచ్చారు. ఒక విధంగా ఇది పేయింగ్ గెస్ట్ విధానం కిందికి వస్తుంది. అయితే, పేయింగ్ గెస్ట్ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి. అయితే యువరాజ్ ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే, ఇంటిని గెస్టుల కోసం అద్దెకు ఇస్తామని ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకమని, అందుకు రూ.1 లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ ఆదేశించింది హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా అతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. నోటీసులకు డిసెంబరు 8న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ సింగ్ ను గోవా టూరిజం శాఖ వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news