ఈ నెల 25 నుంచి అజిత్ ‘వ‌లిమై’ ఓటీటీలో స్ట్రీమింగ్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన తాజా మూవీ‘వలిమై’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీగానే అంచానాలు ఉన్నాయి. పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. అజిత్ సరసన నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అయింది. అయితే.. ఫిబ్రవరి 24 వ తేదీన విడుదలైన వాలిమై మూవీకి మంచి టాక్‌ వస్తోంది. అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ మార్చి 25వ తేదీన ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ లెక్కన మార్చి 25 వ తేదీన జీ-5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా.. ఈ సినిమాలో ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news