ఏపీకి రాజకీయంగా నాలుగు గ్రహణాలు పట్టాయి..!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. కుటుంబ రాజకీయాలకు ఏపీని నెలవుగా మార్చేశారని అన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు కలసి అభివృద్ధిని కుంటుపడేలా చేసారని, అవినీతిపై పోరాడతానన్న వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఏదని అన్నారు.

కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా నాలుగు గ్రహణాలు పట్టాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, జగన్… వీళ్లేనా మహానాయకులు? అంటూ మండిపడ్డారు. దేశం కోసం ప్రకాశం పంతులు, వీరేశలింగం వంటి వారు దేనికైనా సిద్ధపడ్డారని, ఇలాంటి వాళ్లు కనిపించరా..? అని నిలదీశారు

Read more RELATED
Recommended to you

Latest news