మహాత్ముడి కళ్లద్దాలు వేలం, ధర ఎంతంటే..?

-

ప్రపంచంలో మరే కళ్లద్దాలకు పలకనంత ధర మహాత్ముడు గాంధీజీ గారి కళ్లజోడుకు పలికింది. గాంధీజీ వాడిన వస్తువుల్ని అప్పుడప్పుడూ అక్కడక్కడా వేలం వేస్తుంటారు. తాజాగా యూరప్‌లో గాంధీజీ కళ్లద్దాల వేలం ప్రక్రియ జరిగింది. 6 నిమిషాలపాటు జరిగిన ఈ ఫోన్ వేలంలో ఓ వ్యక్తి ఈ కళ్ళద్దాలని దక్కించుకున్నారు. ఇందు కోసం ఆయన 260,000 పౌండ్లు చెల్లించారు. అంటే మన రూ. 2,55,00,906 అన్నమాట. అంత డబ్బు పెట్టి కొన్నారంటే… ఆయనకు గాంధీజీపై ఎంతటి అభిమానం, అరుదైన వస్తువులపై ఎంత అభిరుచి ఉండి ఉండాలి.

gandhi gold spectacles
gandhi gold spectacles

వేలం వేసిన ఈస్ట్ బ్రిస్టల్ సంస్థే ఆశ్చర్యపోయింది. వేలాల్లో ఇదో రికార్డ్ అని తెలిపింది. కాగా, 1920లో దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీని ఒకాయన కలిశారు. ఆ సమయంలో గాంధీజీ వాడిన కళ్లద్దాలను ఆయన తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ముసలాయన అవడంతో ఈ కళ్లద్దాలను వేలం వేశారు. వచ్చిన డబ్బుల్లో తన కూతురికి సగం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news