హైదరాబాద్‌లో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్

-

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఇంట్లో ఏడుస్తూ ఉండటం చూసి.. తండ్రి అడగగా అసలు విషయం బయటపడింది. తనపై కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారని ఆమె పేర్కొంది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

యువతి-గ్యాంగ్ రేప్
యువతి-గ్యాంగ్ రేప్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. అక్కడ మరికొంత మంది యువకులు పరిచయం అయ్యారు. దీంతో అందరూ కలిసి బయటకు వెళ్లారు. అక్కడ వారందరూ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. మే 29వ తేదీన తండ్రికి విషయం తెలిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించగా.. సామూహిక అత్యాచారం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పబ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news