హుజురాబాద్ బై పోల్: హిమ్మత్‌ నగర్‌ ఓటేసిన గెల్లు శ్రీనివాస్

-

హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ చాలా ప్రశాంతంగా కొన సాగుతోంది. ఇప్పటి వరకైతే.. చెదురు మదురు సంఘటన మినహా హుజురాబాద్‌ బై పోల్‌ ప్రశాతంగానే సాగుతోంది. ఈ నేపథ్యం లోనే… జమ్మికుంట మండలంలోని హిమ్మత్‌ నగర్‌ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. కుటుంబ సమేతంగా వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గెల్లు శ్రీనివాస్‌. తన ఓటు హక్కు వినియోగించుకున్నాననిన… ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే అందరూ ఓటు వేయాలని పిలుపు నిచ్చారు గెల్లు శ్రీనివాస్‌. వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని… హుజూరాబాద్ ప్రజలు మార్పు కి నాంది కావాలని పేర్కొన్నారు. కాగా… ఉదయం 11 గంటల సమయం వరకు హుజురాబాద్‌ నియోజక వర్గం లో పోలింగ్‌ శాతం 33 దాటింది. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్‌… ఇప్పిడిప్పుడే పుంజుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news