కేంద్రం నుండి అదిరే ఆఫర్.. ఉచితంగా రూ.లక్ష… ఎలా అంటే..?

-

లక్ష రూపాయలని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు సూపర్ ఛాన్స్. ఒక్క ఫోటో తీసి పంపండి చాలు రూ.లక్ష గెలుచుకోవచ్చు. భారత ప్రభుత్వం ఈ ఆఫర్ ని అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్ని చూస్తే.. మోదీ సర్కార్ మేళా మూమెంట్స్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది. విజేతలకు రూ. లక్ష లభిస్తాయి. మీరు చెయ్యాల్సింది ఏమిటంటే ఒక ఫోటో ని తీసి పంపడమే.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత ప్రభుత్వం ఈ పోటీ ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పండుగలు, మేళాలను ప్రాచుర్యం లోకి తీసుకు రావాలని అనుకుంటోంది. మీకు దగ్గరిలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలు, పండుగలకు వెళ్లి ఫోటో ని తీసి పంపాలి. బెస్ట్ ఫోటో కి బహుమతి వస్తుంది. ఏకంగా రూ. లక్ష వరకు సొంతం చేసుకోవచ్చు.

మేళా వైబ్స్, ఛటోరిగుల్లీ, మేళా ఫేసెస్, మేళా స్టాల్స్ ఇలా కేటగిరీలు వున్నాయి. ప్రతి నెలా ప్రతి కేటగిరి కింద మూడు ఫోటోలను సెలెక్ట్ చేస్తారు. విన్నర్ కి రూ. 10 వేల బహుమతి వస్తుంది. రెండో స్థానంలో ఉన్న వారికి రూ. 7,500 వస్తాయి. అదే మూడవ స్థానంలో నిలిస్తే రూ. 5 వేలు చెల్లిస్తారు.

అలానే గ్రాండ్ ఫినాలే ఉంటుంది. దీనిలో గెలిస్తే రూ. లక్ష బహుమతి లభిస్తుంది. దీనిలో రెండో స్థానంలో ఉన్న వారికి రూ. 75,000 వస్తాయి. మూడు స్థానంలో ఉన్న వారికి రూ. 50 వేలు వస్తాయి. ఈ కాంటెస్ట్ మార్చి 31 వరకు జరుగుతుంది మై గౌ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి ఫోటోలను పంపొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news