ముందస్తుగానే జీహెచ్​ఎంసీ ఎన్నికలు: ఎన్నికల కమిషనర్

-

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన ముందస్తు ఎన్నికల పనులలో ఎలక్షన్ కమిషన్ అలానే సిబ్బంది అందరూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి మొదటి వారం లో జీ హెచ్ ఎం సి టర్మ్ ముగుస్తుందని నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరిపేలా ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించారు ఆయన. అలానే ఇప్పటికే కమిషన్ పలు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించగా అందరూ బ్యాలెట్ బాక్స్ ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరారని అందుకే బ్యాలెట్ ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news