గుంటూరులో దారుణం : శాడిస్ట్ వేధింపులకు టెన్త్ క్లాస్ స్టూడెంట్ బలి

-

మేడికోండూరు మండలం కొర్రపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్ధినికి వేధించాడు. ఆ యువకుడి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది విద్యార్ధిని. ఇక ఆమె ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. తన సూసైడ్ కు కారణమైన అతడి మీద చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో తెలిపింది.  వరప్రసాద్  పై చర్యలు తీసుకోవాలని  బాధితురాలు ఆ వీడియోలో కోరింది.

dead
dead

ఈ వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఆమె తెలిపింది. తనను వేధించిన వరప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు. ఆసుపత్రికి తరలించదానికి లేట్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక చనిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని  ఆమె పోలీసులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news