బీహార్‌లో మరో దారుణం.. బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌..

-

రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. నేరం చేస్తే శిక్షపడుతుందనే ఏ మాత్రం జంకు లేకుండా యథేచ్చగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసిన, ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. రోజూ అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో అత్యాచారం ఘటన బీహార్‌లోని చంపారన్ జిల్లాలో జరిగింది. కదులుతున్న బస్సుల్లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సెక్కిన బాలికకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబందించి నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

13-year-old girl raped, killed in UP; two arrested - The Week

పోలీసుల కథనం ప్రకారం.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో 17 ఏళ్ల బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బస్ డ్రైవర్ ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించాడు. బెట్టయ్యకు అని చెప్పడంతో తాము కూడా అటే వెళ్తున్నట్టు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక బస్సెక్కెంది. బస్సెక్కిన ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారు. అది తాగిన ఆమె స్పృహ కోల్పోవడంతో బస్సులోని నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బస్సును రోడ్డు పక్కన నిలిపి ఆమెను అందులోనే ఉంచి డోర్లు వేసి నిందితులు పరారయ్యారు. తనకు మెలకువ వచ్చిన తర్వాత చూస్తే డోర్లు వేసి ఉన్నాయని, అటుగా వెళ్తున్న వారు గుర్తించి తలుపులు తెరవడంతో తాను బయటపడ్డానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news